చివరిగా నవీకరించబడింది:
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య చైతన్యానికి నూతన దిక్సూచి ఆవిర్భవించింది. సీఎం చంద్రబాబు ట్వీట్ ద్వారా 25,000 మంది ఆదివాసీ విద్యార్థులు ఒకే వేదికపై సూర్యనమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించిన గొప్ప వార్తను దేశానికి తెలియజేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంఅట్టహాసంగా ప్రారంభం అయ్యింది. సీఎం చంద్రబాబు అదిరిపోయే ట్వీట్ చేశారు. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్లు వెల్లడించారు. అసలు ఈ రికార్డ్ ఏంటి? అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశాన్ని ప్రపంచానికి వినిపిస్తూ, ఆంధ్రప్రదేశ్ చిన్నారులు చరిత్ర సృష్టించారని చంద్రబాబు తెలిపారు. ఈ రోజు, రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల నుండి వచ్చిన 25,000 మంది విద్యార్థులు ఒకే వేదికపై సమయానుకూలంగా సూర్యనమస్కారాలు చేసి ‘ఒకే ప్రాంగణంలో అత్యధికంగా సూర్యనమస్కారాలు చేసిన వ్యక్తుల సంఖ్య’ అనే విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారని ట్వీట్ చేశారు.
‘వారు చూపిన శ్రమ, క్రమశిక్షణ పట్ల నాకు గర్వంగా ఉంది. యోగాసనాల ద్వారా ఆరోగ్య చైతన్యం, మానసిక సమతుల్యతను ప్రపంచానికి పంచాలన్న లక్ష్యంలో ఈ ఘనత మనకందరికి ప్రేరణగా నిలుస్తోంది. ఇది వారి శక్తిని, మన ఆరోగ్యపరమైన కట్టుబాటును ప్రతిబింబించే ప్రకాశవంతమైన చిహ్నం’ అయన పేర్కొన్నారు. కాగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచం యావత్తూ యోగా మార్గాన్ని ఆలింగనం చేసేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా ప్రతిసారీ యోగా దినోత్సవ ప్రధాన వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలోనే జరుగుతూ వచ్చినా, ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. విశాఖపట్నంలో ఈ యోగా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది.
ఇప్పటికే యోగాంధ్ర నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు యోగా మాసోత్సవాలు జరిపింది. ప్రజలలో యోగా ప్రాధాన్యతను పెంచేందుకు, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు యోగా శిబిరాలు, ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈరోజు (జూన్ 21) ఉదయం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దీనికోసం విశాఖపట్నంలో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు, వేదికలు, ఆసన ప్రదేశాలు సిద్ధం చేశారు.
#Internationalyogaday
ఆంధ్రప్రదేశ్ పిల్లల నుండి ప్రపంచానికి ఆరోగ్యం మరియు సామరస్యం యొక్క శక్తివంతమైన సందేశం!ఈ రోజు, మా గిరిజన వర్గాల నుండి 25,000 మంది ప్రకాశవంతమైన యువ తారలు సూర్య నమస్కర్ కలిసి ప్రదర్శించడం ద్వారా చరిత్రను సృష్టించారు, అసాధారణమైన గిన్నిస్ ప్రపంచాన్ని ఏర్పాటు చేశారు… pic.twitter.com/0wizx8grmp
– n చంద్రబాబు నాయుడు (@ncbn) జూన్ 20, 2025
ఈ కార్యక్రమం ద్వారా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడమే కాకుండా, 22 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఒకటి ఒకే వేదికపై అత్యధిక మంది విద్యార్థులు సూర్యనమస్కారాలు చేయడం — ఇప్పటికే సాధించిన ఘనతగా ప్రకటించారు. ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పటికే నిన్ననే విశాఖపట్నానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల తర్వాత ఆయన యోగా ఆసనాలు చేసి, యోగా ప్రాముఖ్యతపై ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అధికారులు కూడా పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
జూన్ 21, 2025 6:21 ఆన్






















