చివరిగా నవీకరించబడింది:
పెన్నా అహోబిలం దేవాలయంలో లక్ష్మీ నరసింహ స్వామి ప్రసిద్ధి, కానీ టెంకాయలు అధిక ధరలకు అమ్మకాలు చేసి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెన్నా అహోబిలం దేవాలయం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉంది. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున ఉన్నందున దీనికి ఆ పేరు వచ్చింది. ఈ దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వెలసి ఉన్నాడు. భక్తులు ఈ దేవాలయాన్ని ఒక శక్తివంతమైన పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. పురాణాల ప్రకారం, అహోబిలం అరణ్యంలో ఉన్న నరసింహ స్వామి పాదాల దగ్గర ఒక గుహ నుంచి పెన్నా నది ప్రవహిస్తుందని చెబుతారు. అందువల్ల, ఈ దేవాలయం సమీపంలో ఉన్న పెన్నా నదిని ఒక పవిత్రమైన నదిగా భావిస్తారు. ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్యం కాలంలో నిర్మించబడిందని చరిత్రకారులు చెబుతారు.
ఈ దేవాలయంలో ఉన్న శిల్పకళ నిర్మాణ శైలి ఆనాటి వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఒక పురాణం ప్రకారం, శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ పెన్నా నదికి చెందిన నీటిని ఉపయోగించి తన సైన్యానికి నీరు అందించారు. తర్వాత, స్వామివారిని కలలో దర్శించి, ఈ దేవాలయాన్ని నిర్మించమని ఆదేశించారని చెబుతారు. ఈ ఆలయం కేవలం దైవ దర్శన ప్రదేశం మాత్రమే కాదు, ఇది పర్యావరణ పరంగా చారిత్రక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇది పచ్చని కొండల మధ్య, అద్భుతమైన వాతావరణంలో ఉంది. పర్యాటకులు ఇక్కడ ఆలయాన్ని సందర్శించడమే కాకుండా, చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించడానింకి వస్తారు.
అయితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలం లోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో టెంకాయలను అధిక ధరలను అమ్మకాలను చేసి, భారీగా సొమ్మును చేసుకుంటున్నారని బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధిక ధరల పేర్లతో, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారని భక్తులు బహిరంగ ఆరోపిస్తున్నారు. జిల్లా ఎక్కడలేని విధంగా టెంకాయలను అధిక ధరలకు అమ్మకాలు చేస్తూ, భక్తులను ముక్కు పిండి వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో గుత్తేదారులు టెంకాయ 30 రూపాయలకు అమ్మకాలు చేసేవారు. కానీ కొత్తగా వచ్చిన గుత్తేదారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో, దేవా దాయ శాఖ అధికారుల ఆదేశాలను గాలికి వదిలేసి, బహిరంగ మార్కెట్లో కంటే అధికంగా, ఒకేసారిగా ఒక్క టెంకాయ 60 రూపాయల వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నారని భక్తులు విమర్శిస్తున్నారు. టెంకాయలు అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నావని, గుత్తేదారులకు భక్తులు అడిగితే, వారిపై గుత్తేదారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని టెంకాయలను అధిక ధరలకు అమ్మకాలు చేయకుండా కట్టడి చేయాలని భక్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
హైదరాబాద్, తెలంగాణ
ఆగస్టు 26, 2025 2:27 PM
























