మల్లేశం
సినిమాతో
టాలీవుడ్లో
అడుగుపెట్టిన
అనన్య
నాగళ్ల..
తొలి
చిత్రంతోనే
ఆకట్టుకున్నారు.
ఆ
తర్వాత
వకీల్
సాబ్,
శాకుంతలం,
తంత్ర
వంటి
సినిమాలతో
విభిన్న
చిత్రాలు
చేస్తారన్న
పేరు
దక్కించుకున్నారు.
పొట్టేల్
సినిమాలో
నటనకు
గాను
ఏకంగా
తెలంగాణ
ప్రభుత్వం
నుంచి
గద్ధర్
స్పెషల్
జ్యూరీ
అవార్డును
అందుకున్నారు.
ఇప్పుడిప్పుడే
బిజీ
అవుతున్న
అనన్య
నాగళ్ల
తాజాగా
ఓ
ఛానెల్కు
ఇచ్చిన
ఇంటర్వ్యూలో
సంచలన
వ్యాఖ్యలు
చేశారు.
ఈ
వివరాల్లోకి
వెళితే..
సాఫ్ట్వేర్
ఇంజనీర్
టూ
యాక్టర్
ఖమ్మం
జిల్లా
సత్తుపల్లికి
చెందిన
అనన్య
నాగళ్ల
కుటుంబం
వీరి
తండ్రి
వ్యాపారరీత్యా
హైదరాబాద్లో
స్థిరపడింది.
బీటెక్
పూర్తి
చేసిన
అనన్య
చదువు
తర్వాత
ఇన్ఫోసిస్లో
సాఫ్ట్వేర్
ఇంజనీర్గా
పనిచేశారు.
తర్వాత
నటనపై
ఆసక్తితో
చిత్ర
పరిశ్రమలో
అడుగుపెట్టారు.
తొలుత
షార్ట్
ఫిల్మ్స్
ద్వారా
తన
అదృష్టం
పరీక్షించుకున్న
అనన్యకు
షాదీ
అనే
షార్ట్
ఫిల్మ్కు
గాను
సైమా
షార్ట్
ఫిల్మ్
అవార్డ్స్కు
నామినేట్
అయ్యింది.
ఈ
దశలో
చింతకింది
మల్లేశం
జీవిత
కథ
ఆధారంగా
తెరకెక్కిన
మల్లేశం
సినిమాలో
హీరోయిన్గా
అవకాశం
దక్కించుకుంది
అనన్య.
గద్దర్
అవార్డ్
అందుకున్న
అనన్య
ఈ
చిత్రంలో
నటనకు
గాను
మంచి
గుర్తింపు
తెచ్చుకున్న
ఈ
ముద్దుగుమ్మకు
వరుస
అవకాశాలు
వచ్చాయి.
ప్లే
బ్యాక్,
వకీల్
సాబ్,
మ్యాస్ట్రో,
ఊర్వశివో
రాక్షసివో,
శాకుంతలం,
మళ్లీ
పెళ్లి,
అన్వేషి,
తంత్ర,
డార్లింగ్,
పొట్టేల్,
శ్రీకాకుళం
షెర్లాక్
హోమ్స్
సినిమాలలో
అనన్య
నటించారు.
ముఖ్యంగా
పొట్టేల్
సినిమా
ఆమెకు
మంచి
గుర్తింపు
తీసుకొచ్చింది.
ముక్కుసూటిగా
ఉండే
అనన్య..
ఏ
విషయాన్ని
అయినా
కుండబద్ధలు
కొట్టినట్లు
మాట్లాడతారు.
తాజాగా
తెలుగు
సినీ
పరిశ్రమలో
తెలుగు
అమ్మాయిలకు
అవకాశాలు
రావడం
లేదని
షాకింగ్
కామెంట్స్
చేశారు.
తెలుగు
అమ్మాయిలకు
అవకాశాలు
ఇవ్వరు
సినిమా
అంటేనే
వ్యాపారమని..
హిట్స్
వస్తేనే
నటీనటుల
మార్కెట్
పెరుగుతుందని
అనన్య
తెలిపారు.
వైష్ణవి
చైతన్య
మంచి
హిట్
కొట్టగానే..
మరో
క్రేజీ
ప్రాజెక్ట్లో
అవకాశం
దక్కించుకున్నారని..
కానీ
మరో
ఇండస్ట్రీకి
చెందిన
హీరోయిన్
హిట్
కొడితే
ఇచ్చినన్ని
అవకాశాలు,
తెలుగు
హీరోయిన్లకు
ఇవ్వడం
లేదని
అనన్య
సంచలన
వ్యాఖ్యలు
చేశారు.
హిట్స్
ఇచ్చినా
తెలుగు
అమ్మాయిలకు
మంచి
అవకాశాలు
ఎందుకు
రావడం
లేదని
బాధపడినా..
దీనిపై
ఆలోచించగా
నన్ను
నేను
మార్కెంటింగ్
చేసుకోవాలని
నిర్ణయించుకున్నట్లు
అనన్య
తెలిపింది.
తన
కష్టం
వల్లే
ఇప్పుడు
లేడీ
ఓరియెంటెడ్
సబ్జెక్ట్స్
వెతుక్కుంటూ
వస్తున్నాయని
వెల్లడించింది.
ప్రేమలో
మోసపోయా
అయితే
అనన్య
నాగళ్ల
సినిమాల్లోకి
వచ్చేనాటికి
ఓ
వ్యక్తితో
ప్రేమలో
ఉన్నారు.
కొన్నాళ్లకు
అతనితో
బ్రేకప్
కావడంతో
తట్టుకోలేకపోయానని..
మూడేళ్ల
పాటు
ఆ
బాధను
అనుభవించానని
తెలిపారు.
కానీ
ఈ
బాధను
వృత్తిపై
పడనీయలేదని..
రాత్రంతా
ఏడ్చి
పొద్దున్నే
జిమ్కు
వెళ్లిపోయేదాన్నని..
సెట్లోకి
వచ్చి
కేరవాన్లో
ఏడ్చేసి
ఏం
జరగనట్లు
కళ్లు
తుడుచుకుని
నవ్వుకుంటూ
వచ్చేదాన్నని
అనన్య
గుర్తుచేసుకున్నారు.
అసలు
దీని
నుంచి
బయటపడతానా?
లేదా?
అని
తొలుత
భయపడ్డానని
తర్వాత
కోలుకున్నానని..
ఈ
నరకయాతన
గురించి
ఇంట్లో
వాళ్లకు
కూడా
తెలియదని,
నా
స్నేహితులకు
మాత్రమే
తెలుసని
అనన్య
వెల్లడించింది.
ప్రస్తుతం
ఆమె
వ్యాఖ్యలు
సోషల్
మీడియాలో
వైరల్
అవుతుండగా..
అనన్యను
మోసం
చేసిన
వ్యక్తి
ఎవరు?
అంటూ
నెటిజన్లు
కామెంట్స్
పెడుతున్నారు.
























