మెగా డీఎస్సీ నిర్వహణలో భాగంగా సోమవారం జరిగిన స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజ్) సోషల్ స్టడీస్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 38,243 అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోగా 36,372 (95.11%) మంది హాజరయ్యారు. ఈ మేరకు డీఎస్సీ–2025 కన్వీనర్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 227 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు ఉదయం అనంతపురం జిల్లాలో (97.84%) మంది, మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలో (97.98%)అత్యధికంగా అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు.
























