ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
– ఈసీ నీలం సాహ్ని

మీడియా ప్రతినిధి – అమరావతి: ఏపీలో త్వరలో ఎన్నికల మోత మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచనలు చేశారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని నీలం సాహ్ని ఆదేశించారు. రానున్న సంవత్సరంలో ఏపీలో జరిగే ఎన్నిలకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రణాళికా బద్ధంగా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, పోలీస్ బలగాలు, ఎలక్ట్రోరల్ రోల్ అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.
























