చివరిగా నవీకరించబడింది:
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు ముందే హీటెక్కిస్తున్నాయి. అధికార వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పార్టీలో నియోజకవర్గ ఇన్చార్జుల మార్పు నిర్ణయంతో ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లుగానే ..ఇప్పుడు లోక్ సభ సభ్యులు కూడా మెల్లిగా వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, మచిలీపట్నం లోక్ సభ సభ్యుడు బాలశౌరి బాటలోనే మరో కీలక నేత పార్టీ పదవితో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)రాజకీయాలు ఎన్నికలకు ముందే హీటెక్కిస్తున్నాయి. అధికార వైసీపీ(YCP)కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పార్టీలో నియోజకవర్గ ఇన్చార్జుల మార్పు నిర్ణయంతో ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లుగానే ..ఇప్పుడు లోక్ సభ సభ్యులు కూడా మెల్లిగా వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, మచిలీపట్నం లోక్ సభ సభ్యుడు బాలశౌరి బాటలోనే మరో కీలక నేత పార్టీ పదవితో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేశారు.వైసీపీ నుంచి మరో వికెట్ ఔట్ ..వైసీపీకి ఓ కీలక నేత షాక్ ఇచ్చారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కూడా వైసీపీకి , ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అనిశ్చితి నెలకొందని ..నరసరావుపేట నియోజకవర్గానికి కొత్త అభ్యర్ధిని తెస్తున్నారనే ప్రచారంతో పార్టీ క్యాడర్ అయోమయంలో ఉందని అందుకే ఆ అనిశ్చితికి తాను తెర దింపాలనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే పల్నాడు జిల్లాలో ఇప్పటికే రెండు వర్గాలుగా ఉన్న వైసీపీలో చాలా రోజుల నుంచి ఎంపీ లావు కృష్ణ దేవరాయుల్ని కాదని మంత్రి విడదల రజనీ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన మొదట్నుంచి ఆమె తీరును విభేదిస్తూ వస్తున్నప్పటికి అధిష్టానం కూడా ఆమెకే మద్దతిస్తూ వస్తోందని ఆయన పలుమార్లు పార్టీ శ్రేణుల దగ్గర వాపోయినట్లుగా తెలుస్తోంది.
వైసీపీ నుంచి మరో వికెట్ ఔట్ ..
వైసీపీకి ఓ కీలక నేత షాక్ ఇచ్చారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కూడా వైసీపీకి , ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అనిశ్చితి నెలకొందని ..నరసరావుపేట నియోజకవర్గానికి కొత్త అభ్యర్ధిని తెస్తున్నారనే ప్రచారంతో పార్టీ క్యాడర్ అయోమయంలో ఉందని అందుకే ఆ అనిశ్చితికి తాను తెర దింపాలనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే పల్నాడు జిల్లాలో ఇప్పటికే రెండు వర్గాలుగా ఉన్న వైసీపీలో చాలా రోజుల నుంచి ఎంపీ లావు కృష్ణ దేవరాయుల్ని కాదని మంత్రి విడదల రజనీ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన మొదట్నుంచి ఆమె తీరును విభేదిస్తూ వస్తున్నప్పటికి అధిష్టానం కూడా ఆమెకే మద్దతిస్తూ వస్తోందని ఆయన పలుమార్లు పార్టీ శ్రేణుల దగ్గర వాపోయినట్లుగా తెలుస్తోంది.
ఎన్నికలకు ముందు వైసీపీకి షాక్..
చివరగా మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఉండగానే లావు కృష్ణదేవరాయులు వైసీపీకి గుడ్ బై చెప్పడం పార్టీకి ఒకింత నష్టమేనని పల్నాటు వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. వైసీపీ సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికు కూడా రాజీనామా చేశారు లావు శ్రీకృష్ణదేవరాయులు. ఈసందర్భంగా మీడియాకు ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.
పల్నాడు రుణం తీర్చుకుంటా..
పల్నాడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారని ..గత ఎన్నికలలో మంచి మెజారిటీ తో గెలిపించి పార్లమెంట్ కు పంపించారని తెలిపారు.పల్నాడు అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
జనవరి 23, 2024 11:20 ఆన్






















