చివరిగా నవీకరించబడింది:
AP Politics: ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. సోమవారం కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాల, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటు, కేటాయింపుపై సుదీర్ఘ సమయం చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh )లో త్వరలో జరగబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ (BJP)మధ్య పొత్తు కుదరడమే కాకుండా సీట్ల సర్దుబాటు కూడా చకచకా జరిగిపోయింది. రాష్ట్రంలో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తు కోరింది. ఇందులో భాగంగానే జనసేన ఎన్డీఏలో ఉండటంతో టీడీపీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యమైంది. ఇక మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలనే నిర్ణయించుకోవడంతో సోమవారం చంద్రబాబు నివాసంలో మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్,బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాల సీట్ల సర్దుబాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. చివరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 144 అసెంబ్లీ స్థానాలతో పాటు 17లోక్ సభ స్థానాల్లో టిడీపీ పోటీ చేయనుంది. ఇక జనసేనకు 21 అసెంబ్లీ , 2లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6లోక్ సభ సీట్లు కేటాయించడం జరిగింది. అయితే పార్టీలకు కేటాయించిన సీట్లతో పాటు ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవర్ని బరిలోకి దింపాలి, ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తామనే విషయంపై కూడా ఈ మూడు పార్టీల కీలక నేతలు మరోసారి చర్చించుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అటుపైనే అభ్యర్ధుల జాబితాలను ప్రకటించడం జరుగుతుందని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు..ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. సోమవారం కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాల, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటు, కేటాయింపుపై సుదీర్ఘ సమయం చర్చించారు. అనంతరం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో మూడు పార్టీలు తమకున్న ఓటు బ్యాంక్ ప్రకారం సీట్ల సర్దుబాటుకు అంగీకారం తెలుపుకున్నాయి. ప్రధాన పార్టీగా ఉన్నటు వంటి తెలుగుదేశం 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ఇక 25లోక్ సభ స్థానాల్లో 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించడం జరిగింది. ఇందులో జనసేనకు 21 అసెంబ్లీ , 2లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించింది.
కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు..
ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. సోమవారం కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాల, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటు, కేటాయింపుపై సుదీర్ఘ సమయం చర్చించారు. అనంతరం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో మూడు పార్టీలు తమకున్న ఓటు బ్యాంక్ ప్రకారం సీట్ల సర్దుబాటుకు అంగీకారం తెలుపుకున్నాయి. ప్రధాన పార్టీగా ఉన్నటు వంటి తెలుగుదేశం 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ఇక 25లోక్ సభ స్థానాల్లో 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించడం జరిగింది. ఇందులో జనసేనకు 21 అసెంబ్లీ , 2లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించింది.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @పావంకల్యన్ గారు ఉండవల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ @ncbn గారి నివాసంలో కేంద్ర మంత్రి శ్రీ @gssjodhpur బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ @Pandajay తో సమావేశమయ్యారు.@Bjp4india @Bjp4andhra@Janasenaparty @Jaitdp pic.twitter.com/clrdsfv5jf
— JanaSena Party (@JanaSenaParty) మార్చి 11, 2024
మూడు పార్టీలు ఏకమై..
రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీతో పొత్తులు పెట్టుకోకపోవడంతో బీజేపీ నష్టపోవాల్సి వచ్చింది. ముందుగా అనుకున్న స్థానాల కంటే తక్కువగా వచ్చినప్పటికి ….గతంతో పోలిస్తే కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయని కాస్త సంతృప్తి చెంది సరిపెట్టుకుంది. ఇప్పుడు ఏపీలో కూడా బీజేపీకి అలాంటి పరిస్థితి రాకూడదని..టీడీపీ, జనసేన కూటమితో చేతులు కలిపింది కాషాయం పార్టీ. అందులో భాగంగానే వైసీపీ పార్టీ ఒక్కటే మేజర్ పార్టీగా ఉండకూడదనే ఆలోచనతోనే కలిసి పోటీ చేయడానికి సిద్దమైంది. సీట్ల సర్దుబాటు విషయంలో ఆదిశగానే చర్చలు జరిపి ఓ కొలిక్కి వచ్చేలా తీర్మానం చేసుకున్నాయి. అసెంబ్లీ స్థానాల కంటే లోక్ సభ స్థానాలు తమకు ముఖ్యం కాబట్టి టీడీపీ, జనసేనకు అసెంబ్లీ సీట్లు ఎక్కువ ఇచ్చి..6 లోక్ సభ స్థానాలను బీజేపీ తీసుకుంది.
ప్రజల తీర్పు ఎలా ఉంటుందో..
అయితే మూడు పార్టీలు కలిసి బరిలోకి దిగుతున్నప్పటికి వైసీపీ మాత్రం వై నాట్ 175 అనే ధీమాతోనే సిద్దం పేరుతో ఎన్నికలకు రెడీ అవుతోంది. మరి ఏపీ ఎన్నికల్లో ఈ మూడు రంగుల జెండాల కూటమికి ప్రజలు పట్టం కడతారో లేక ఒంటరిగా బరిలోకి దిగుతున్న ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి మళ్లీ అధికారం అప్పజెబుతారో చూడాలి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
మార్చి 11, 2024 10:59 PM

























