అందుకోసం వర్శిటీలోని ఆయా విబాగాధి పతులతో పాటు.. అధ్యాపకులు తమకు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. దేశీయ పరికరాలతో తయారు చేసినందున కేవలం రు.2.75 లక్షల వ్యవయంతో అతి తక్కవ ఖర్చుతో చిన్న తరహా ఉపగ్రహాన్ని తమ అద్యాపకులు, విద్యార్థులు కలిసి రూపొందించారన్నారు. ఖర్చు మొత్తాన్ని కెఎల్ వర్శిటీ చైర్మన్ కోనేరు సత్యన్నారాయణ భరించాని వివరించారు. ఈ సందర్బంగగా కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ పరిశోధనా మరియు అభివృద్ధి డైరెక్టర్ డాక్టర్ కె.శరత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తాము రూపొందించిన చిన్న తరహా ఉపగ్రహం వాతావరణ కొలత, సాంకేతికతలో ఒక స్మారక పురోగతిని సూచిస్తుందన్నారు.
ఈ మిషన్ భూమి యొక్క పర్యావరణం మరియు మన వాతావరణం గురించి ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తుందన్నారు. ఈ మిషన్ కు డైరెక్టర్ మరియు చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ గా డాక్టర్ కె శరత్ కుమార్ వ్యవహరిస్తుండగా.. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ప్రొఫెసర్ పూర్వవిద్యార్ధుల విభాగ డైరెక్టర్ డాక్టర్ కెసిహెచ్ కావ్యలు వ్యవహరిస్తున్నారని తెలిపారు. వీరిద్దరు కలిసి 1 క్యూబ్శాట్ను ఖచ్చితమైన ప్రణాళిక, రూపకల్పన చేశారన్నారు. హై ఆల్టిట్యూడ్ బెలూన్ (హెచ్ఎబి) ద్వారా ప్రారంభించటానికి మాడ్యూల్, సాఫ్ట్ వేర్ కోడింగ్, హార్డ్ వేర్ ఇంటిగ్రేషన్, అసెంబ్లీ, టెస్టింగ్ మరియు ఫైనల్ మాడ్యూల్ తయారీలో మొత్తం 22 మంది ఈసీవీ విద్యార్థులతో పాటు ఒక మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి కలిసి.. గత 6 నెలల పాటు శ్రమించి ఈ ఉపగ్రహానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
ఈ మిషన్ ద్వారా వాతావరణ కొలత సాంకేతికతపై మన అవగాహనను పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. కీలకమైన డేటాను సంగ్రహించడానికి, ప్రసారం చేయడానికి సజావుగా కలిసి పని చేసే ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన భాగాల సంక్లిష్ట వ్యవస్థను ఉపయోగిస్తుందన్నారు. ఈ మిషన్ భూమి యొక్క వాతావరణం యొక్క రహస్యాలను అన్వేషించడంతో పాటు సంచలనాత్మక శాస్త్రీయ పరిశోధనలకు దోహద పడుతుందన్నారు.ఈ మిషన్ యొక్క ఒక క్లిష్టమైన పొర ఆన్-బోర్డ్ కంప్యూటర్ (సెన్సార్స్) లేయర్, క్లిష్టమైన పర్యావరణ డేటాను సంగ్రహించడానికి బాధ్యత వహిస్తుందన్నారు.
ఇది వాతావరణ పీడనాన్ని కొలిచే వివిధ రకాల సెన్సార్లను కలిగి ఉందన్నారు. కార్బన్ మోనాక్సైడ్ మరియు మీథేన్ వంటి వివిధ వాయువులను గుర్తించడం, ఖచ్చితమైన చలనం, ధోరణిని ట్రాక్ చేయడం, ఉష్ణోగ్రతను పర్యవేక్షించడం, ఓజోన్ స్థాయిలను గుర్తించడానికి అంతరిక్షంలోకి వెళ్లడమని పేర్కొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాను నిర్ధారించడం అనేది బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ (బిఎస్ఎం) లేయర్, ఇది మిషన్-క్లిష్టమైన భాగం. ఈ లేయర్లో సౌర ఫలకాలు మరియు లిథియం-అయాన్ బ్యాటరీలు వంటి విద్యుత్ సరఫరా భాగాలు ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 26, 2023 1:16 PM
























