చివరిగా నవీకరించబడింది:
Yoga at LB Stadium: ప్రతీ సంవత్సరం యోగా కార్యక్రమాలను మనం జూన్ 21న చూస్తాం. ఈసారి చిన్న మార్పు. ఇవాళే కౌంట్డౌన్ ప్రారంభించారు. మరి ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం ఎలా జరుగుతోందో చూద్దాం.
ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. విశాఖకు వెళ్తుండటంతో.. ఈ యోగా కార్యక్రమం ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డులతోపాటూ.. మరెన్నో ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. దాంతో క్రెడిట్ మొత్తం ఏపీ ప్రభుత్వానికి వెళ్లేలా ఉండటంతో.. అప్రమత్తమైన తెలంగాణ నేతలు.. తెలంగాణలో కూడా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఒక రోజు ముందే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. కౌంట్ డౌన్ ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో ఇవాళ ఈ కార్యక్రమ కౌంట్డౌన్ కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పిల్లలు, పెద్దలు, ఆర్మీ దళాలు.. ఇలా అందరూ ఎల్బీ స్టేడియంకి తరలివచ్చారు. అలాగే.. సినీ నటి ఖుష్బూ కూడా ఇందులో పాల్గొని యువతను ఉత్సాహ పరిచారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే.. అనేక మంది సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన బోతున్నారు.
యోగా పుట్టింది ఇండియాలోనే. వేల ఏళ్లుగా ఇది అభివృద్ధి చెందుతోంది. ఐతే.. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఇది మరింతగా ప్రపంచ గుర్తింపు పొందింది. కేంద్రంలో ప్రధాని మోదీ.. ప్రధాని అయ్యాక.. 2014 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి.. యోగా కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రకటించింది. ఏటా జూన్ 21న ఈ కార్యక్రమం జరిపేలా ప్లాన్ చేసింది. అలా ఇప్పటివరకూ 11సార్లు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఇక ఇప్పుడు 12వ దినోత్సవం జరగబోతోంది.
ఎల్బీనగర్ స్టేడియంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉదయం నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజంతా ఈ కార్యక్రమం అక్కడ జరుగుతుంది. రేపు పెద్ద ఎత్తున జరుగుతుంది. అలా ఇవాళ్టి నుంచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా.. ఎక్కువ మందిని ఇందులో పాల్గొనేలా చెయ్యాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.
ఈ కౌంట్ డౌన్ కార్యక్రమం ద్వారా ఇవాళ యోగా ప్రాముఖ్యం, ప్రయోజనాలను నిపుణులు.. ప్రజలకు తెలియజేస్తారు. తద్వారా మరింత ఎక్కువ మంది యోగా పట్ల ఆసక్తి చూపేందుకు అవకాశాలు ఉన్నాయి. యోగా వల్ల మానసికంగా, శారీరకంగా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.. ప్రపంచ దేశాల ప్రజలు యోగాకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐతే.. ఈసారి ఏపీ ప్రభుత్వం దీన్ని ఘనంగా నిర్వహించబోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు భారీగా చేశారు. అందువల్ల ఇకపై ఏపీ ప్రభుత్వం యోగాకి ఎక్కువ ప్రయార్టీ ఇస్తూ.. దాన్ని మరింతగా అభివృద్ధి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
హైదరాబాద్, తెలంగాణ
జూన్ 20, 2025 6:49 ఆన్

























