Sports
-Kannaiah
RCB:ఐపీఎల్
2025
ఫైనల్
మ్యాచ్లో
రాయల్
ఛాలెంజర్స్
బెంగళూరు
(ఆర్సీబీ)
పంజాబ్
కింగ్స్పై
గెలుపొంది
17
ఏళ్ల
తర్వాత
తొలి
ట్రోఫీని
గెలుచుకుంది.
కర్ణాటక
మాత్రమే
కాకుండా
దేశం
మొత్తం
ఈ
విజయాన్ని
ఆనందంగా
జరుపుకుంది.
అయితే,
ఆ
మరుసటి
రోజు
బెంగళూరులోని
ఎం.చిన్నస్వామి
స్టేడియంలో
నిర్వహించిన
విక్టరీ
వేడుకలో
తొక్కిసలాట
జరిగి
11
మంది
మరణించారు.
ఈ
ఘటన
దేశవ్యాప్తంగా
దిగ్భ్రాంతి
కలిగించింది.
దీని
తరువాత
అనేక
పరిణామాలు
చోటు
చేసుకున్నాయి.
బెంగళూరులోని
ఎం.చిన్నస్వామి
స్టేడియం
వద్ద
జరిగిన
తొక్కిసలాటలో
11
మంది
మరణించడం
ఆర్సీబీ
ట్రోఫీ
గెలుపు
సంబరాన్ని
విషాదంలోకి
నెట్టింది.
ఈ
ఘటనకు
సంబంధించి
అనేక
పరిణామాలు
చోటు
చేసుకున్నాయి.
నగర
పోలీసు
కమిషనర్తో
సహా
పలువురు
పోలీసు
అధికారులను
సస్పెండ్
చేశారు.
అంతేకాకుండా,
ఆర్సీబీ,
కేఎస్సీఏలపై
ఎఫ్ఐఆర్
నమోదు
చేయగా,
విరాట్
కోహ్లీపైనా
కేసు
నమోదైంది.
ఆ
తర్వాత
ఆర్సీబీ
ఫ్రాంచైజీని
అమ్మేస్తారనీ,
బ్యాన్
చేస్తారనే
పుకార్లు
సోషల్
మీడియాలో
వ్యాపించాయి.
దీనిపై
ఫ్రాంచైజీ
స్పష్టతనిచ్చింది.
ఎట్టి
పరిస్థితుల్లోనూ
అమ్మేది
లేదని
తేల్చి
చెప్పింది.
తద్వారా
ఆ
పుకార్లకు
అడ్డుకట్ట
వేసింది.
ఆర్సీబీ
రిటైన్
చేసుకున్న
ఆటగాళ్లు
ఇప్పుడు
19వ
సీజన్కు
రాయల్
ఛాలెంజర్స్
బెంగళూరు
జట్టులో
ఎవరు
ఉంటారనే
వార్త
హల్
చల్
చేస్తోంది.
ఈ
సీజన్లో
రాయల్
ఛాలెంజర్స్
బెంగళూరు
బ్యాటింగ్,
బౌలింగ్,
ఫీల్డింగ్
విభాగాల్లో
చక్కటి
ప్రదర్శన
కనబరిచింది.
బలమైన
జట్లపై
విజయం
సాధించి
ఫైనల్లో
పంజాబ్
కింగ్స్ను
ఓడించి
17
ఏళ్ల
తర్వాత
ఛాంపియన్గా
నిలిచింది.
రాయల్
ఛాలెంజర్స్
బెంగళూరు
జట్టులో
ఈసారి
బ్యాటింగ్,
బౌలింగ్
లైనప్
బాగుంది.
ఎవరిని
ఏ
స్థానంలో
ఆడిస్తే
బాగుంటుందనే
ముందస్తు
ప్రణాళిక
కూడా
జట్టు
సక్సెస్లో
కీలక
పాత్ర
పోషించింది.
ఇదిలా
ఉంటే
అనుకున్నదాని
కంటే
ఉత్తమ
ఆటగాళ్లు
ఉండటంతో
వారిని
కొనసాగించి
కొందరిని
మాత్రం
వదులుకోనుంది
రాయల్
ఛాలెంజర్స్
బెంగళూరు.
ఆర్సీబీలో
కొనసాగే
ఆటగాళ్లు:
-
రజత్
పాటిదార్
(కెప్టెన్) -
విరాట్
కోహ్లీ -
ఫిల్
సాల్ట్ -
జాకోబ్
బెథెల్ -
మయాంక్
అగర్వాల్ -
జితేష్
శర్మ -
కృనాల్
పాండ్యా -
టిం
డేవిడ్ -
రోమారియో
షెఫర్డ్ -
జోష్
హేజిల్వుడ్ -
సుయాష్
శర్మ -
భువనేశ్వర్
కుమార్ -
యష్
దయాళ్ -
నువాన్
తుషార -
లుంగి
ఎన్గిడి -
మనోజ్
భండగే -
స్వప్నిల్
సింగ్ -
స్వస్తిక్
చికార
RCB
రిలీజ్
చేయనున్న
ఆటగాళ్ల
జాబితా:
-
లియామ్
లివింగ్స్టోన్ -
అభినందన్
సింగ్ -
రాసిఖ్
సలామ్
దార్ -
మోహిత్
రాథి -
బ్లెస్సింగ్
ముజరబానీ -
టిమ్
సీఫెర్ట్
ఈసారి
ఆర్సీబీ
తరఫున
ఆడిన
చాలా
మంది
ఆటగాళ్లు
జట్టు
విజయంలో
కీలక
పాత్ర
పోషించారు.
కాబట్టి
మినీ
వేలానికి
ముందు
కొద్ది
మంది
ఆటగాళ్లను
మాత్రమే
వదులుకోనున్నట్లు
తెలుస్తోంది.ఈ
మేరకు
ఆర్సీబీ
జట్టు
కసరత్తులు
చేస్తోంది.
జట్టు
కూర్పుపై
దృష్టి
సారించింది.
























