చివరిగా నవీకరించబడింది:
కర్నూలు జిల్లాలో యోగా దినోత్సవం సందర్భంగా 5,287 ప్రాంతాలలో యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహించారు. కలెక్టర్ ప్రజల ఆరోగ్యం కోసం యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లాలో విస్తృతంగా యోగపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సుమారు నెలరోజులుగా కర్నూలు జిల్లాలో 5,287 ప్రాంతాలలో యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహించి ప్రజలకు యోగపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున కర్నూలు జిల్లాలో సుమారు పదివేల మందితో యోగాసనాలు వేసేందుకు కర్నూలు జిల్లా ఆటో స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష మాట్లాడుతూ ఆరోగ్య, సుసంపన్న, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించిందని ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా… సంపన్నంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించిందన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మన రాష్ట్రం ఒక రికార్డును సృష్టించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 39 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో అత్యధికంగా కర్నూలు జిల్లా నుండి 12 లక్షల 76 వేల మందిని రిజిస్ట్రేషన్ చేయగలిగామన్నారు. నెలరోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగస్తులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు.
ఇదే తరహాలోనే ప్రజలు యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ప్రతిరోజూ ఒక 45 నిమిషాల పాటు యోగాసనాలు వేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి గురుకుల కొరకుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురై ఎన్నో ఇబ్బందులు పడుతూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని వాటి నుంచి బయటపడాలంటే కచ్చితంగా యోగాసనాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. కావున ప్రతి ఒక్కరు యోగాను ప్రతిరోజూ చేస్తూ అలవాటు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
కర్నూల్, ఆంధ్రప్రదేశ్
జూన్ 21, 2025 9:58 PM
























