- మైనర్ లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
- మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం
- ర్యాష్ డ్రైవింగ్, శబ్ద కాలుష్యం చేస్తే వాహనాలు సీజ్ చేసి చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం
మీడియా ప్రతినిధి – మంగళగిరి: మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరిక, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు. మంగళగిరి మండలం రూరల్ పరిధిలో మంగళగిరి గ్రామీణ ఎస్సై సిహెచ్ వెంకట్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతమంది మైనర్ బాలురు ఒకే వాహనంపై నలుగురు వెళుతుండటంతో వారిని ఆపి కౌన్సిలింగ్ ఇచ్చి కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.. ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్ వెంకట్ మాట్లాడుతూ ఎవరైనా మైనర్ బాలురకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై, వాహనదారులపై, వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడుతుందని ఆయన హెచ్చరించారు.అంతే కాకుండా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సరైన ధ్రువపత్రాలు లేకుండా ద్విచక్రవాహనాలు నడిపితే

వాహనాన్ని సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ హెచ్చరించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని వాహనదారులకు ఆయన సూచించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అలాకాకుండా మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం వలన జరిగే అనర్థాలను మైనర్లకు ఎస్సై వెంకట్ వివరించారు. అర్ధరాత్రులు రోడ్ల పైన ఆకతాయిలు నిర్లక్ష్యంగా వాహనాలను నడిపిన, శబ్ద కాలుష్యం సృష్టిస్తే వాహనాలను సీజ్ చేసి కేసులో నమోదు చేస్తామని ఎస్ఐ వెంకట్ హెచ్చరించారు.
























