మంగళగిరి టిడ్కో కాలనీలో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

మీడియా ప్రతినిధి – మంగళగిరి: మంగళగిరి పట్టణం టిడ్కో కాలనీలో దివీస్ లేబొరేటరీస్ సంస్థ సహకారంతో ఏర్పాటుచేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా టిడ్కో కాలనీకి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక ప్రజానీకం, కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతి ఇచ్చి మంత్రి లోకేష్ కు స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ప్లాంట్ మొత్తం కలియతిరిగి దివీస్ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటర్ క్యాన్ ను మంచినీటితో నింపి మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దివీస్ సంస్థ సీఎస్ఆర్ హెడ్ జి.నగేష్, కూటమి నేతలు పాల్గొన్నారు.

మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా రూ.3 కోట్ల వ్యయంతో 19 ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు

మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా దివీస్ లేబొరేటరీస్ సంస్థ రూ.3 కోట్ల వ్యయంతో వెయ్యి లీటర్ల సామర్థ్యం గల 19 ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేయడం జరిగింది.

మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద – 4,
మంగళగిరి టిడ్కో కాలనీలో – 2,
పెనుమాక టిడ్కో గృహసముదాయం వద్ద – 2,
నిడమర్రు టిడ్కో గృహసముదాయం వద్ద – 1,
నవులూరు టిడ్కో గృహసముదాయం వద్ద – 1,
ఇప్పటం గ్రామంలో – 1,
కాజ వద్ద – 2,
చిర్రావూరు గ్రామంలో – 1,
చినకాకానిలో – 1,
ఆత్మకూరు హౌసింగ్ లేఅవుట్ లో – 1,
కాటమరాజు కొండూరులో – 2,
ప్రాతూరు గ్రామంలో – 1
మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటుచేయడం జరిగింది.























