
మీడియా ప్రతినిధి – గుంటూరు: ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే PGRS లక్ష్యం – గుంటూరు జిల్లా శ్రీ ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు.
ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ ( PGRS) కార్యక్రమం” నకు విచ్చేసిన ప్రజల వద్ద ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలకు చట్ట పరిధిలో తగిన పరిష్కారం చూపిస్తామని భరోసా ఇచ్చిన శ్రీ ఎస్పీ గారు.
ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఫిర్యాదుల పట్ల దృష్టి సారించి ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో తగిన న్యాయం అందించాలని పోలీస్ అధికారులకు శ్రీఎస్పీ గారు ఆదేశించారు.

జిల్లా నలమూలల నుండీ విచ్చేసిన ప్రజలతో శ్రీ ఎస్పీ గారు మరియు ఇతర పోలీస్ అధికారులు ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అదనపు(క్రైమ్స్) శ్రీమతి సుప్రజ గారు మహిళా బాదితుల వద్దకు నేరుగా వెళ్లి వారి ఫిర్యాదులు స్వీకరించారు.

పోలీస్ సిబ్బంది PGRS కి వచ్చిన ఫిర్యాదు దారులకు వారి ఫిర్యాదులను రాయడంలో సహకరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ(క్రైమ్స్) శ్రీమతి K.సుప్రజ గారు, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ రమేష్ గారు,మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ శ్రీ సుబ్బారావు గారు, CCS శివాజీ గారు, PGRS సీఐ శ్రీనివాసరావు గారు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
























