చివరిగా నవీకరించబడింది:
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యోగా విశిష్టతను ప్రపంచానికి చాటి చెబుతూ, యోగా ఏకత్వానికి ప్రతీక అని, ప్రపంచాన్ని ఒక వేదిక పైకి తీసుకువచ్చిందని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “దేశమంతటా , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. 11వ సారి, జూన్ 21న ప్రపంచం మొత్తం యోగాను పాటించేందుకు ఏకతాటిపైకి వస్తోంది. ‘యోగ’ అనే పదానికి అర్థం ‘ఐక్యత’, ఈ రోజు యోగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన విధాన్ని చూడడం మన హృదయాలను హత్తుకునే అంశం.” అని అన్నారు. ప్రధానమంత్రి మోదీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, “యోగా అందరికీ చెందింది. ఇది ఎటువంటి సరిహద్దులు, నేపథ్యం, వయస్సు లేదా సామర్థ్యాన్ని అనే వ్యత్యాసాలు లేకుండా అందరికీ వర్తిస్తుంది” అని పేర్కొన్నారు.
అలాగే మోదీ మాట్లాడుతూ.. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయని, 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని అన్నారు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని అభిప్రాయపడ్డరు. గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది తెలిపారు. గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారని.. యోగాకు వయసుతో సంబంధం లేదని.. యోగాకు హద్దులు లేవని వివరించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
జూన్ 21, 2025 7:21 ఆన్






















