
మీడియా ప్రతినిది – ఒంగోలు: నేర నియంత్రణ చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పటిష్టమైన చర్యలలో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జి,డార్మిటరీస్ లను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లాలోని లాడ్జీల్లో పోలీసులు ప్రతీ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, రాత్రి వేళల్లో లాడ్జిలులో బస చేసిన వ్యక్తల వివారాలను పరిశీలించి, కోత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలపై ఆరా తీశారు. అదేవిధంగా రాత్రి వేళలో బస చేసిన ప్రయాణికులను తనిఖీ చేసి అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించి నేర నియంత్రణకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. లాడ్జీలలో బస చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డులు, ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహించాలని నిర్వహకులకు సూచించారు. చట్ట విరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వరాదని, లాడ్జి పరిసరాలు స్పష్టంగా కన్పించేలా తప్పనిసరిగా సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. అనుమానాస్పద వ్యక్తులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.డార్మిటరీస్, లాడ్జిల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
























