గిన్నిస్ రికార్డే లక్ష్యంగా …!
జూన్ 21 ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజును భారీ స్థాయిలో యోగా కార్యక్రమాలను చేపట్టనుంది. ఒక్క విశాఖలోనే ఒకే రోజు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్కే బీచ్ లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు పాల్గొంటారు.
























