చివరిగా నవీకరించబడింది:
illicit Affair: ఆ మహిళ చేసిన కిరాతకాన్ని చూసి స్థానికులు వణికిపోయారు. ప్రియుడిపై మోజుతో ఇంతటి దురాగతానికి ఒడిగట్టడం ఏంటని పోలీసులు షాక్ అయ్యారు.
అక్రమ ఎఫైర్ హత్య: అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు మధ్య వివాదాలు రావచ్చు. లేదా సమస్యలు రావచ్చు. కానీ ఈ మధ్యకాలంలో చిన్నపాటి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆపై మరొకరితో సత్సంబంధాలు పెట్టుకుని, మూడుముళ్ళు వేసిన భర్తను భార్యల స్వయంగా కడతేరుస్తున్నారు, దీంతో భార్యలను నమ్మి ఏవిధంగా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితి కొందరి భర్తలకు దాపరిస్తుందని చెప్పుకోవచ్చు.తాజాగా ఏపీకి సంబంధించి గుంటూరుజిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగిన ఘటనలో ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చాయి.
భోజనం పెడతాను రండి అంటూ భోజనంలో మత్తుమందు కలిపి, భర్త నిద్రపోయిన తర్వాత ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన చర్చినియాంసంగా మారింది. ముందుగా భర్తకు గుండెనొప్పి వచ్చింది అని చెప్పి కవర్ చేద్దామనుకున్నప్పటికీ చిన్న క్లూతో పోలీసులు చేసిన ఎంక్వయిరీలో మొత్తం విషయాలు బయటపడ్డాయి, ఈ ఘటనకు సంబంధించి గుంటూరుజిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు ఈనెల 18వ తేదీన తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్యాస్ సమస్య కారణంగా గుండెపోటుతో సహజంగానే చనిపోయాడని అతని భార్య లక్ష్మీమాధురి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు భర్త మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఆ పోస్టుమార్టంలో ఛాతి లోపల ఎముకలు విరిగినట్లుగా గుర్తించారు. ఈ విషయం ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు అనేక విషయాలు వెలుగు చూశారు.
ప్రధానంగా భార్య లక్ష్మీమాధురికి సత్తెనపల్లికి చెందిన గోపికి కొంతకాలంగా వివేహతర సంబంధం ఉందని తెలిపారు. 2007లో భర్త శివనాగరాజుతో భార్య లక్ష్మీ మాధురికి వివాహం జరగగా తర్వాత విజయవాడ ఓసినిమాహోటల్లో పనిచేస్తున్నప్పుడు గోపితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసినట్లుగా పోలీసులు తెలిపారు, తర్వాత భర్తసైతం భార్యను కొట్టడం లాంటి విషయాలు దృష్టిలో పెట్టుకున్న లక్ష్మీ మాధురి ప్రియుడు గోపితో కలిసి భర్తను హతమార్చే ప్రయత్నాలు ప్రారంభించింది.
దీనిలో భాగంగా ప్రియుడు స్నేహితుడైన ఆర్ఎంపీ డాక్టర్ సురేష్ సహాయంతో మత్తు టాబ్లెట్స్ తీసుకుని భర్తకి అన్నంలో పౌడర్ మాదిరిగా చేసి పెట్టి నిద్రించే విధంగా స్కెచ్ వేసింది, ఆపై ప్రియుడ్ని అతని స్నేహితుడిని ఇంటికి పిలిచి నిద్రపోతున్న భర్తపై ఊపిరాడకుండా చేసి గుండెలపై రొట్టెల కర్రతో కొట్టడంతో మరణించినట్లుగా పోలీసులు తెలిపారు.
భార్య ప్రేమ విషయం తెలిసి మానసికంగా వేధిస్తున్నాడని అందుకే ఈ దారుణానికి పాల్పడినట్లుగా లక్ష్మీ మాదిరి పోలీసుల విచారణలో తెలిపినట్లుగా సమాచారం అందుతుంది,ఏది ఏమైనా ఈ ఘటనతో గుంటూరు జిల్లాలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. ఇలాంటి కిల్లాడి లేడీ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు కోరుతున్నారు.
గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
























