తెలంగాణ రైతాంగానికి అండగా నిలుస్తూ, ప్రజా ప్రభుత్వం తమ మాట నిలబెట్టుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘రైతు నేస్తం’ వేదికగా ఆన్లైన్లో మీట నొక్కి, రైతు భరోసా నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
























