చివరిగా నవీకరించబడింది:
కుబేర సినిమా విశాఖలో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక, జిమ్ సర్భ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కుబేర సినిమా చాలా బాగుందంటూ విశాఖలో అభిమానులు చెబుతున్నారు. ధనవంతులు – పేదవాళ్ల మధ్య డ్రామా నేపథ్యంగా సాగుతూ, సామాజిక సందేశం, భావోద్వేగాలు, యాక్షన్, ప్లానింగ్లతో నిండిన కథనాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారని అంటున్నారు. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి తన మార్క్ దర్శకత్వం చూపించారంటూ చెబుతున్నారు. కుబేర సినిమా చాలా బాగా తీశారు అంటూ చెబుతున్నారు.
సినిమాలో నాగార్జున క్యారెక్టర్ చాలా బాగుందని అభిమానులు చెబుతున్నారు. నిజాయితీ గల సీబీఐ ఆఫీసర్ దీపక్ (నాగార్జున) నటించారు అని అంటున్నారు. తప్పుడు కేసుల వలన జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో న్యాయం పట్ల అతనికున్న విశ్వాసం పోతుంది అని అంటున్నారు. నాగార్జున తన పాత్రలో జీవించారు అని అంటున్నారు. నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచిన దీపక్ క్యారెక్టర్లో నాగార్జున నటన అద్భుతంగా ఉంది అని అంటున్నారు. ఇది సినిమాలో నాగార్జున రాగానే ప్రేక్షకులందరికీ మంచి ఉత్సాహం వచ్చిందని చెబుతున్నారు.
ధనుష్ బెగ్గర్గా ఆడియెన్స్ను తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. దేవ పాత్రలో ఆయనకి బదులుగా మరెవ్వరినీ ఊహించలేం అంతే. రష్మిక మందన్నా తన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకుంది. జిమ్ సర్భ్ విలన్గా బాగా వర్క్ అయ్యారు. సినిమా స్టోరీలో బిచ్చగాడు దేవ (ధనుష్) కీలక పాత్ర పోషిస్తాడు.
ఇకపోతే శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లింది. తనదైన శైలిలో పాత్రలను తీర్చిదిద్ది కథనాన్ని నడిపించిన విధానం సినిమాకి మరింత ప్లస్ అయింది. డబ్బే ఊపిరిగా జీవించే నెగటివ్ క్యారెక్టర్ నీరజ్, నిజాయితీకి ప్రాణం అర్పించిన దీపక్, జీవితంపై ఆశలే లేని దేవ.. ఈ మూడు వైవిధ్యమైన పాత్రలతో వెండితెరపై మ్యాజిక్ చేశారు శేఖర్ కమ్ముల. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించినా అంతలోనే కథలోకి తీసుకెళ్లడంలో శేఖర్ తన మార్క్ చూపించారు. అన్ని సినిమాల్లో లాగే ఎక్కడో చోట రొటీన్ సీన్స్ అయితే దర్శనమిచ్చాయి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
జూన్ 20, 2025 6:20 PM
























