అధికారుల పరిశీలన, ప్రణాళికలు:
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ ఈ క్షేత్రస్థాయి పరిశీలన, సమీక్షకు నాయకత్వం వహించారు. వీరితో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ మోనాలిసా డాష్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిరా ప్రసాద్, ఆరోగ్య, పట్టణ ప్రణాళిక, ఆయుష్, వీఎంఆర్డీఏ వంటి కీలక శాఖల అధిపతులు పాల్గొన్నారు.
























